పశ్చిమాసియా ఉద్రిక్తల కారణంగా బంగారం, వెండి ధరలు గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చాయి. కానీ పెళ్లిళ్ల సీజన్ ముందూ సడెన్గా పడిపోయిన బంగారం, వెండి ధరలు కొనుగోళు దారులకు పెద్ద ఊరనిచ్చాయి. శనివారం కేవలం 4గంటల్లోనే తులం బంగారంపై రూ. 2,940 తగ్గగా, కేజీ వెండిపై ఏకంగా రూ.10వేలు తగ్గింది. ఈ భారీ హెచ్చుతగ్గుల తర్వాత హైదరాబాద్ సమా దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా ఉన్నాయి.
శనివారం ఉదయం మార్కెట్లో చోటుచేసుకున్న భారీ మార్పుల తర్వాత హైరదాబాద్లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ప్రస్తుతం రూ.1,45,970గా ఉండగా ఉదయం 6 గంటలకు ఈ ధర రూ.1,48,900, వద్ద స్థిరపడింది. అంటే జస్ట్ 4 గంటల్లోనే తులం బంగారంపై రూ.2900లకు పైగా పెరిగింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,33,800గా ఉండగా ఉదయం 6 గంటలకు ఈ ధర రూ.1,36,540 వద్ద స్థరపడింది.
ఇక ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నంలోనూ హైదరాబాద్ తరహా రేట్లు కొనసాగుతున్నాయి. అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగళూరు, కేరళ, పూణెలోనూ 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,45,970గా ఉండగా 22 క్యారెట్ల ధర రూ.1,33,800 వద్ద కొనసాగుతుంది.
అలాగే దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ప్రస్తుతం రూ.1,46,120గా ఉండగా ఉదయం 6గంటలకు ఈ ధర రూ.1,49,050 వద్ద స్థరపడింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,33,950 గా ఉంది. ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,48,580గా ఉండగా 22 క్యారెట్ల ధర రూ.1,36,200 గా ఉంది.
ఇక వెండి విషయానికి వస్తే వెండి కూడా బంగారం బాటలోనే దూసుకొస్తుంది. శనివారం ఒక్కరోజే వెండి ధర ఏకంగా రూ.10,000 దిగొచ్చింది. ఉదయం 6గంటలకు రూ. 2,59,900 ఉన్న కేజీ వెండి ధర ఉదయం 11గంటలకు రూ.10వేలు తగ్గి 2,50,000 వేలకు చేరింది. అయితే బంగారం ధరలను డాలర్ ప్రభావం చేస్తుంటుంది. కాబట్టి ఎప్పుడైనా ధరలు మారవచ్చు. మీకు ఎప్పకప్పుడూ అప్డేట్స్ ధరలు తెలియాలంటే సంబంధిత వెబ్సైట్లను సందర్శించండి.





