తాజావార్తలు

ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు

ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు


ఈ ఆనవాళ్ల కచ్చితమైన వయస్సును నిర్ధారించేందుకు కార్బన్ డేటింగ్ పరీక్షల నిమిత్తం నమూనాలను పంపినట్లు అధికారులు వెల్లడించారు. గంగాధర్ మెహర్ యూనివర్సిటీ చరిత్ర విభాగం ప్రకారం, ఈ ప్రాంతంలో 45కు పైగా రాతి ఆవాసాలు ఉన్నాయి. ఇక్కడున్న చిత్రాల్లో ఆదిమానవుల జీవనశైలి, వేట దృశ్యాలు, జంతువుల బొమ్మలు కనిపిస్తున్నాయి. సహజసిద్ధమైన రంగులతో గీసిన ఈ చిత్రాలు నాటి మానవుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ గుహలు మహాభారత కాలం నాటివిగా స్థానికులు నమ్ముతున్నప్పటికీ, శాస్త్రీయంగా ఇవి అంతకంటే ఎంతో ప్రాచీనమైనవని తేలింది. ఈ చారిత్రక ప్రదేశాన్ని జాతీయ వారసత్వ సంపదగా గుర్తించి, పర్యాటకంగా అభివృద్ధి చేయాలని చరిత్రకారులు, స్థానికులు కోరుతున్నారు. ఈ తవ్వకాలతో భారత ఉపఖండంలోని ఆదిమానవ చరిత్రకు సంబంధించి మరిన్ని కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *