హంపి కర్ణాటక : అందమైన కొండలు పచ్చటి ప్రకృతి , రాజభవనాలు, ఆలయాలు , స్వచ్ఛమైన గాలి మధ్య ఆనందంగా నాలుగు రోజులు గడపాలి అనుకునే వారికి హంపి చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. అంతే కాకుండా భారత దేశంలో సందర్శించాల్సిన అద్భుతమైన ప్రదేశం. అందుకే టూర్ ప్లాన్ చేసే వారు తప్పకుండా హంపి వెళ్లాల్సిందే అంటున్నారు నిపుణులు.
Travel5
కూర్గ్ కర్ణాటక : అందమైన తేయాకుతోటల్లో కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే మీకు ఇది బెస్ట్ సమయం అని చెప్పవచ్చును. అందమైన ప్రదేశాల్లో కూర్గ్ ఒకటి. కాఫీ, టీ తోటలు, అందమైన కొండలు, పొగమంచుతో చాలా అద్భతంగా ఉంటుంది ఈ ప్రదేశం. ముఖ్యంగా ఇది మానసిక ప్రశాంతతను అందిస్తుంది.
లక్షద్వీప్ : ఎండ వేడి నుంచి తప్పించుకొని, బీచ్లో ఎంజాయ్ చేస్తూ, కొబ్బరి చెట్ల కింద ఏకాంతంగా , చీచ్ తీరాలను చూస్తూ ఆనందంగా గడపాలి అనుకునేవారికి లక్షద్వీప్ బెస్ట్ అని చెప్పవచ్చు. ఇది అందమైన బీచ్లకు నిలయం. ఇక్కడి ప్రదేశం ప్రతి ఒక్కరికీ చాలా సులభంగా నచ్చుతుంది.
కొడైకనాల్ , తమిళనాడు : అందమైన జలపాతాలు, స్వచ్ఛమైన సరస్సులు, పచ్చని ప్రకృతి, ఎత్తైన కొండలు, ఇక్కడి ప్రదేశం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏప్రిల్ నెలలో ఇక్కడ చాలా ప్రశాతంగా, చల్లగా ఉంటుంది. అంతే కాకుండా సమ్మర్లో పిల్లలతో ఈ ప్రదేశాలకు వెళితే ఆనందంగా ఎంజాయ్ చేయవచ్చును.





