కావాల్సిన పదార్ధాలు : కడిగిన పెట్టుకున్న రొయ్యలు, ఒక టేబుల్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, రెండు టేబుల్ స్పూన్స్ కారం, ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి రెండు కప్పులు శనగపిండి , ఒక గ్లాస్ నూనెను తీసుకోవాలి.
ముందుగా రొయ్యలను కడిగి ఉప్పుతో ఒకసారి, వేడి నీటితో ఒకసారి బాగా శుభ్రపరచుకోవాలి. వీటికి ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.
రొయ్యలను ఉడకబెట్టాలి. అంతే కాదు వీటిలో కొద్దిగాకూడా నీరు లేకుండా చేసుకోవాలి. వీటికి రెండు టేబుల్ స్పూన్స్ కారం, ఒక టీ స్పూన్ గరం మసాలా, అర టీ స్పూన్ మసాలా పొడి, మూడు స్పూన్స్ నిమ్మరసం కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక కప్పు శనగపిండి, కరివేపాకు, కొత్తిమీర ఆకులు వేసి నీళ్ళు పోస్తూ వాటిని బాగా కలుపుకోవాలి.
కలిపిని మిశ్రమాన్ని తీసుకుని పాన్ లో ఒక్కోటిగా వేస్తూ.. ఎర్రగా కాలిన తర్వాత రెండు వైపులా తిప్పుతూ వాటిని నూనెలో బాగా వేయించుకోవాలి. అంతే, వేడి వేడి రొయ్య పకోడీలు రెడీ.





