సింహ కోడూరి, సత్య ప్రధాన పాత్రల్లో దర్శకుడు రితిష్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తు వదలరా-2’. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్. మత్తు వదలరా మూవీకి సీక్వెల్గా రూపొందిన ఈ చిత్రం.. మధ్య విడుదలై థియేటర్లలో ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టింది.
అలాగే ఓటీటీలోకి కూడా ట్రెండింగ్ లో దూసుకుపోతూ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలోని ప్రతీ క్యారెక్టర్ కావల్సినంత హ్యుమర్ అందిస్తుంది. ముఖ్యంగా సత్య కామెడీ సినిమాకే హైలైట్ అని చెప్పాలి. ఇదిలా ఉంచితే.. అప్పట్లో ఇన్స్టాలో ‘వేర్ ఇజ్ రియా’ అని మీమ్స్ ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా తన అందంతో కట్టిపడేసింది. ఇప్పటికీ ఈ సినిమాను ఓటీటీలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు. కాగా ఈ సినిమాలో ప్రతీ పాత్ర ఆకట్టుకోగా ఇప్పుడు ఓ అమ్మడి గురించి నెటిజన్స్ గూగుల్ లో గాలిస్తున్నారు.
మత్తువదలరా 2 మూవీలో నటి రోషిణికి కూతురు క్యారెక్టర్లో నటించిన అమ్మాయి గుర్తుందా.? శాన్వి పాత్ర స్క్రీన్పై కనిపించేది కొంతసేపే.. అయినా ఆమె తన నటన, అందంతో ఆకట్టుకుంది. ఉన్నది కొంతసేపు అయినా ఆమె ప్రేక్షకులను కాట్టిపడేసింది. ఆమె మరెవరో కాదు.. సింధు రెడ్డి.
ఇన్స్టాలో రీల్స్ ద్వారా ఫేమస్ అయిన ఈ బ్యూటీకి.. ఇదే మొదటి తెలుగు చిత్రం. ఇన్స్టాలో మాంచి ఫాలోయింగ్ సంపాదించిన ఈ చిన్నది.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ను అలరిస్తోంది. ఈ అమ్మడి ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.





